Super Star Krishna-Indira Devi : నాటకాలు వేస్తూ.. తన కెరీర్ ను మొదలుపెట్టిన కృష్ణ ఆ తర్వాత తేనె మనసులు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన కృష్ణ టాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగారు. అయితే నవంబర్ 15న ఆయనకు కార్డియాక్ అరెస్టు కావడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కృష్ణ ఆరోగ్యం క్రిటికల్ గా మారుతూ రావడం, అవయవాలు కూడా పూర్తిగా చెడిపోవడం, చికిత్సకు అనుకూలించకపోవడంతో కన్నుమూసారు. అయితే కొద్ది రోజుల క్రితం కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణించిన కొద్ది రోజులకి కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కూడా స్వర్గస్తులయ్యారు.
దిమ్మ తిరిగే కండీషన్
అయితే ఇందిరా దేవి ఉండగా, కృష్ణ.. విజయ నిర్మలని వివాహం చేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ అయింది. వృత్తిపరంగా కలిసిన విజయనిర్మల-కృష్ణ వ్యక్తిగతంగా దగ్గర కావడంతో సీక్రెట్గా గుళ్లో పెళ్లి చేసుకున్నారు. విజయనిర్మలకు కూడా అది రెండో వివాహం కాగా, నరేష్ మొదటి భర్తకు కలిగిన సంతానం. దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించగా, ఆ మూవీలో కృష్ణ, విజయనిర్మల కెమిస్ట్రీ వెండితెరపై పండింది.దాంతో వారిద్దరు కలిసి పలు సినిమాలకి కలిసి పని చేయడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి గుళ్లో పెళ్లి చేసుకున్నారు.
కృష్ణ రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఇందిరా దేవి మాత్రం ఆయనతో ఉంది. ఏ సినిమా ఫంక్షన్ అయినా విజయ నిర్మల కృష్ణతో కలిసి వచ్చేవారు. ఇక ఫంక్షన్ లలో ఇందిరా, విజయ నిర్మల ఇద్దరూ కలుసుకొని బాగానే మాట్లాడుకునే వారు. అయితే రెండో పెళ్లి విషయాన్ని కృష్ణ… ఇందిరా దేవికి చెప్పగా ఆమె ఆ సమయంలో మౌనంగానే ఉండిపోయిందట. ఇక చేసేదేం లేక ఆమెని స్వాగతించింది. కాని ఇందిరా దేవి పెళ్లిని ఒప్పుకున్నారు గాని… విజయ నిర్మలతో పిల్లలను కనడానికి మాత్రం నో చెప్పారట. ఈ కారణంగానే కృష్ణ, విజయ నిర్మల పిల్లలని కనలేదని చెబుతుంటారు.