Money : పూల మొక్కలు మీ ఇంటి అందాన్ని పెంపొందించడమే కాదు ఆహ్లాదంతో పాటు ఆక్సిజన్ ని కూడా అందిస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని పూల మొక్కలు ప్రత్యేక దిశలో ఉంచి పెంచినట్లయితే ఆ ఇంటికి విశేష ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ కాలంలో చాలా మంది ఇంటి అలంకరణ కోసం రకరకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటారు. అయితే ఆ పూల మొక్కలను కూడా ప్రత్యేకమైన దిశలో ఉంచి పెంచినట్లయితే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి.. ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది.
మొక్కలు మాత్రమే కాదు ఇంటి చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంగణంలో కూడా మీరు వేప , ఉసిరి, మారేడు వంటి మొక్కలను పెంచాలని పండితులు సైతం చెబుతున్నారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఈ చెట్లకు ప్రత్యేకమైన పూజలు చేయడం హిందువుల ఆనవాయితీ. వేసవి కాలం వచ్చింది అంటే ఈ చెట్ల ద్వారా చల్లటి వాతావరణాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు.ఈ చెట్లు శుభ ఫలితాన్ని ఇవ్వటమే కాదు వరుస చెట్లు ఇంటి చుట్టూ ఉంటే సంతానప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
![If you plant these flowering plants in that direction at home, you will get unexpected money](https://dailytelugunews.com/wp-content/uploads/2022/02/Money-6.jpg)
ముఖ్యంగా గోవర్ధన వంటి మొక్కలను ఇంటి లో పెట్టుకోవాలి. ఇక సన్న జాజి , మల్లె, తెల్లని పువ్వు చెట్టు, జాజిపూలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అని సమాచారం. ఇంటి ప్రాంగణంలో కృష్ణ తులసి, లక్ష్మి తులసి రెండింటినీ కలిపి పూజించినట్లయితే ఆ ఇళ్లు లక్ష్మీ నిలయం గా మారుతుందని , లక్ష్మీదేవికి ఈశాన్య మూలలో పద్మ తత్వాన్ని విరాజిల్లే పుష్పాలను వుంచి ఆమెకు నిత్యం పూజ చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందట.