Health Tips చాలామంది నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు ఉపవాసం చేస్తుంటారు. కొందరు మాత్రం మొదటిరోజు, చివరి రోజు ఉపవాసం చేస్తుంటారు. మీరు నవరాత్రి ఉపవాస సమయంలో హైడ్రేట్ గా ఉండడానికి, శక్తులు కాపాడుకోవడానికి ఏదైనా తినవచ్చు. దీనికోసం ఉపవాసం చేసే వాళ్ళు తరచుగా పాలు, టీ, బాదం, మఖాన, బంగాళదుంపలు వంటివి తీసుకుంటారు.
వీటితోపాటు నవరాత్రి ఉపవాస రోజుల్లోసగ్గుబియ్యం కూడా తినవచ్చు. ఎందుకనగా సగ్గుబియ్యం తినడం వలన శరీరానికి పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తింటే చాలా ప్రయోజనం చేకూరుతుంది. వాస్తవానికి వస్తే పాలు, సగ్గుబియ్యం రెండు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
ఎముకలను బలపరుస్తాయి
పాలు, సగ్గుబియ్యం ని కలిపి తినడం వలన మీ ఎముకలు దృఢంగా మారుతాయి. పాలలో ప్రోటీన్లు, కాలుష్యం ఉంటాయి.ఇటువంటి పరిస్థితుల్లో, మీరు కనుక పాలు, సగ్గుబియ్యం ను కలిపి తినడం వల్ల మీ ఎముకలకు శక్తి లభిస్తుంది. కీళ్ల నొప్పులను సైతం వదిలించుకోవచ్చు.
Health Tips కడుపు సమస్యలను నయం చేస్తాయి
పొట్ట సమస్యల నుండి బయటపడడానికి పాలు, సగ్గుబియ్యం కలిపి తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాలు, సగ్గుబియ్యం కలిపి తింటే జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే, మీ ఆహారంలో కచ్చితంగా పాలు, సగ్గుబియ్యం చేర్చండి.
రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచుతుంది
పాలు, సగ్గుబియ్యం ను డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తినవచ్చు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సాబుదాన ఉపయోగకరంగా ఉంటుంది. గ్లైసే మిక్ ఇండెక్స్ సగ్గుబియ్యం లో తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.
పాలలో సగ్గుబియ్యం ఎలా చేయాలి
దీనికోసం మొదటగా, సగ్గుబియ్యం ను 1-2 గంటలు నానబెట్టి ఉంచండి.
దీని తర్వాత, పాలలో సగ్గుబియ్యం వేసి దానిని బాగా మరిగించాలి.
ఈ మిశ్రమాన్ని కిందకు అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి.
దీని తర్వాత పంచదార వేసి పాయసం లాగా తాగవచ్చు.
నవరాత్రుల ఉపవాస రోజుల్లో పాలు, సగ్గుబియ్యం ను తినవచ్చు.సాధారణ రోజుల్లో కూడా పాలు, సగ్గుబియ్యంను కలిపి తినవచ్చు. ఇది మీకు తగినంత ప్రోటీన్లను, శక్తిని అందిస్తుంది.