Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వయస్సు 79 సంవత్సరాలు కాగా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 4:09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచి వేసింది. కృష్ణని కడసారి చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మరి కొద్ది నిమిషాలలో కృష్ణ అంత్యక్రియలు జరపనున్నారు. అయితే కృష్ణ ఇక మన మధ్య లేరని తెలిసి కృష్ణ ఫ్యామిలీ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. మహేష్. సితార అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
గౌతమ్ గొప్ప మనసు
ఇక గౌతమ్ కూడా తన తాత తిరిగి రారని తెలిసి కుమిలి పోతున్నారు. అయితే తన తాతయ్యతో కలిసి నటించాలని గౌతమ్ ఎంతగానో అనుకున్నాడు. కాని అది జరగకముందే కృష్ణ కన్నుమూయడం గౌతమ్ని తీవ్ర భావోద్వేగానికి గురి చేసిదంది. అయితే తన తాతయ్య కోసం ఏదో చేయాలని అనుకున్న గౌతమ్.. కృష్ణ చదివిన ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ ని సొంత ఖర్చులతో మెరుగు పరచాలని అనుకుంటున్నాడట. ఇప్పుడు ఆ కాలేజి మరీ అద్వాన్న స్థితిలో ఉండగా, దానిని బాగోగులు ఇప్పుడు గౌతమ్ చూసుకోబోతున్నాడట.
అంతేకాదు కృష్ణ పేరుతో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నానడని సమాచారం. గౌతమ్ కి కృష్ణకి మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది. ఎప్పుడు ఖాళీ సమయం ఉన్నా తన తాతయ్య దగ్గరకు వెళ్లి సరదాగా కొద్ది సేపు గడిపి వచ్చేవాడు. అప్పుడప్పుడు నమ్రత కూడా కృష్ణ గారితో తన ఇద్దరు పిల్లలు చేసే సందడికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చేది. కాగా, కృష్ణకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారు ఇందిరా దేవి, విజయనిర్మల. 2019లో విజయనిర్మల కన్నుమూయగా, ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. కృష్ణ- ఇందిరాలకి ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.