Good News : మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

Good News : కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరేలా రక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది.. ఇక ఈ నేపథ్యంలోనే పీఎమ్ మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం లో మహిళలు లబ్ధి పొందవచ్చు.. అదేమిటంటే మహిళలకు తొలి కాన్పు విషయంలో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఇప్పుడు అతి త్వరలో కేంద్రం రెండో కాన్పుకు కూడా ఈ స్కీంను అమలు చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం లో రెండో కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే ఈ స్కీం అందించాలని భావిస్తున్నట్లు సమాచారం..

ఇకపోతే ఇప్పటి వరకు భర్త ఆధార్ కార్డు వివరాలు తీసుకొని కేంద్రం ఈ పథకం ద్వారా డబ్బులు వారి ఖాతాలో జమ చేసేది. ఇకపై ఈ నిబంధన విషయంలో కేంద్రం మార్పు తీసుకురానున్నట్లు సమాచారం.. ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం మహిళలకు ప్రయోజనం చేకూరేలా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎక్స్ పెండిచర్ ఫినాన్స్ కమిటీ ప్రతిపాదనల ప్రకారం ఈ పథకం ద్వారా ఏడాదికి 51.7 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనాలు పొందుతున్నారు.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో మహిళలకు ఈ సహాయం అందించనుంది..

Good news for women from central government
Good news for women from central government

మొదటి విడతగా వెయ్యి రూపాయలు, రెండో విడతగా రెండు వేల రూపాయలు మూడో విడతగా మరో రెండు వేల రూపాయలను పొందే అవకాశాన్ని కల్పించింది . అలా మొత్తం గర్భిణీ స్త్రీ యొక్క భర్త ఖాతాలో ఈ డబ్బులు 5000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది.. మహిళలు ఒకవేళ మీరు కూడా గర్భం దాల్చినట్లు అయితే మీకు దగ్గరలో ఉన్న ఆశావర్కర్లను సంప్రదించి ఈ పథకంలో చేరవచ్చు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఈ స్కీం పొందడానికి అనర్హులు.. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మాత్రమే ఇలాంటి పథకాలను అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.