Smart Phone : ఇటీవల కాలంలో గేమ్స్ ఆడటానికి కూడా చాలామంది ఖరీదైన మొబైల్స్ ను వాడుతున్న విషయం తెలిసిందే. కానీ రోజు రోజుకి స్మార్ట్ ఫోన్స్ ధరలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇలాంటి ఫోన్స్ ను కొనుగోలు చేయలేకపోతున్నారు. కానీ ఈ క్రమంలోనే చైనాకు సంబంధించిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ షియోమీ తాజాగా భారత్లో తన మార్కెట్ ను క్రమంగా విస్తరించడానికి ఆ కంపెనీ నుంచి మరో కొత్త బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్మీ 10A స్పోర్ట్ పేరుతో బడ్జెట్ ధరలో మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసి కష్టమర్లను ఆకర్షిస్తోంది.
ఇకపోతే అత్యధిక ర్యామ్ కెపాసిటీ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ మరింత అప్గ్రేడ్ ఫీచర్లతో విడుదల కావడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే రెడ్ మీ అందిస్తున్న కొత్త వేరియంట్ ఫీచర్లు కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. రెడ్మి 10 ఏ వేరియంట్ 4 జి బి రామ్ తో విడుదలయింది . కానీ ఈ కొత్త స్పోర్ట్ మోడల్ కు అధికంగా 6 జిబి ర్యామ్ కెపాసిటీ కల్పించడం గమనార్హం. ఇక డిజైన్ విషయానికి వస్తే పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది కానీ స్క్రీన్ పై వాటర్ డ్రాప్ నాచి కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా కెమెరాల విషయానికి వస్తే లాడ్జ్ కెమెరా మాడ్యూల్ తో పవర్ బటన్ , వాల్యూమ్ బటన్స్ కుడివైపు ఇస్తూ ఉండడం గమనార్హం.
ఇక ఈ మొబైల్ 6.53 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో TFT IPS రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది అంతేకాదు ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 12.5 ఓఎస్ పై ఈ స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది. 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ కెపాసిటీతో లభించే ఈ స్మార్ట్ ఫోన్ మరింత అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే 13 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రధాన కెమెరా, సెల్ఫీ వీడియో కోసం 5 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు.10 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది .. ఇక ధర విషయానికి వస్తే..8GB ర్యామ్, 128 GB స్టోరేజ్ కెపాసిటీ మొబైల్ ధర రూ.10,999.సీ బ్లూ, చార్కోల్ బ్లూ వంటి కలర్స్ లో లభిస్తుంది.