Jr NTR : కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. బిజెపి తరఫున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామంటూ మరో సంచలనానికి తెర తీశారు.. సోము వీర్రాజు ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ప్రజాదరణ ఉందని తెలిపారు.
భవిష్యత్తులో ఆయన సేవలను బిజెపి ప్రచారం కోసం వినియోగించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు..!! మీడియా మిత్రులు సోము వీర్రాజుని.. ఆయన సేవలను ఎక్కడ వినియోగించుకుంటారు అని ప్రశ్నించగా.. జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కడైతే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందో.. ఆయన సభలు ఎక్కడ ఎక్కువగా పెడితే ప్రజలు అక్కడికి పెద్ద ఎత్తున వస్తారో.. అక్కడే ఆయన ప్రచారాన్ని వినియోగించుకుంటామని సోము వీర్రాజు చెప్పారు..
అంటే ఇన్ డైరెక్ట్ గా ఏపీలోనే బిజెపి ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ సేవలను వాడుకుంటామని సోము వీర్రాజు తెలిపారు. ఏపీ రాజకీయాలు పొత్తుల గురించి కూడా సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతోనే చెప్పారు. పవన్ కళ్యాణ్ తో ఇప్పటికీ కలిసే ఉన్నామని సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..