AP government new scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.. తెలుగుదేశం పార్టీలు కూడా జగన్ తీసుకునే నిర్ణయాలు చూసి ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆరు నెలల్లోనే పనితీరు చూసి ప్రజలే జవాబు చెబుతారన్న మాటలు అందరికీ ప్రభావితంగా మారాయి.. వాస్తవానికి ఆయన అధికారంలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆయన పనితీరును ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు.. తాజాగా మరో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
వాలంటీర్ల నియామకం, సచివాలయాల ఏర్పాట్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్ల వేతనం పెంపు, 108 వాహనాలు ప్రతి చోటా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ఏపీలో వైద్య ఆరోగ్యశాఖను తానే పర్యవేక్షిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమంలో భాగంగా మరో 3.10 కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్తరించింది. కొత్త లబ్ధికారుల కోసం 137 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సంక్షేమ పథకాలు కోసం దరఖాస్తు చేసిన 3,39,096 మందికి సంక్షేమ వద్దగాలతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని.. వైయస్సార్ పెన్షన్ కానుకగా కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేసామని.. కొత్తగా 7051 బియ్యం కార్డులు, 3025 ఆరోగ్యశ్రీ కార్డులు, 1249 మందిని కాపు నేస్తం కింద, వాహన మిత్ర కింద మరో 236 మందికి లబ్ది మంజూరు చేసినట్లు సీఎం తెలిపారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఏపీలోని ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక లబ్ధి చేకూరితోందని మంత్రులు ఏపీ సీఎం జగన్ అనేకసార్లు చెబుతున్నారు. తాజాగా స్టిక్కర్ల ద్వారా ఇదే విషయాన్ని ప్రజలు లబ్ధిదారులకు గుర్తించాలని ఆలోచనలో వైసిపి ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఎన్నికల నాటికి ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు పడేలాగా సరికొత్త పథకాన్ని తీసుకురావాలని జగన్ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం.