Triphala Choornam: ప్రస్తుత రోజుల్లో చాలామందికి కంటి సమస్య అనేది సాధారణమైపోయింది. సమాజంలో పదిమందిలో.. 8 మంది కళ్ళజోళ్ళు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. మన పూర్వీకుల రోజులలో అసలు కళ్ళజోడు అంటేనే ఎవరికి తెలియదు. అయితే రోజు రోజుకి టెక్నాలజీ పెరగటంతో మానవ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా కంప్యూటర్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ నీ ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్న క్రమంలో.. కంటి సమస్యలు సాధారణమైపోయాయి. ఇలాంటి క్రమంలో కంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో బెస్ట్ రెమెడీ వైద్యులు తెలియజేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ గా మారింది.
![An Ayurvedic doctor who introduced TRIPHALA Churnam medicine to people suffering from eye problems](https://dailytelugunews.com/wp-content/uploads/2023/10/images-1.jpg)
ఈ వీడియోలో త్రిఫల చూర్ణంతో తేనె కలుపుకొని రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి అని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. అంతేకాదు త్రిఫల చూర్ణం గోరువెచ్చని నీళ్లలో రాత్రి పడుకునే ముందు.. ఒక టీ గ్లాసులో ఒక అర టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవడం ద్వారా తర్వాత రోజు ఉదయమే ఫ్రీ మోషన్ కావడంతోపాటు.. కంటి సమస్యలు భాగవుతాయని స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో రేడియేషన్ ద్వారానే ఎక్కువగా కంటి సమస్యలు వస్తున్నాయని ఈ వీడియోలో ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు.
![An Ayurvedic doctor who introduced TRIPHALA Churnam medicine to people suffering from eye problems An Ayurvedic doctor who introduced TRIPHALA Churnam medicine to people suffering from eye problems](https://herbadiet.in/cdn/shop/products/organic-herb-powders-herbadiet-usda-organic-triphala-powder-premium-grade-digestive-supplement-2_grande.jpg?v=1553865474)
మరి కొంతమందికి సరైన పోషకాలు అందగా ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలియజేశారు. ఏది ఏమైనా కంటి సమస్య ముందు వారి జీవన శైలిని తెలుసుకున్న ద్వారా వైద్యం అందిస్తే బెటరని త్రిఫల చూర్ణం కంటి సమస్యలకు అద్భుతంగా పనిచేసే ఔషధం మాత్రమే కాదు కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. ఈ చూర్ణంలో కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మిశ్రమంతో తయారుచేసిన ఈ చూర్ణం చాలా సమస్యలకు పరిష్కారం చూపుతోందని చెప్పకోచ్చారు.