Surendranadh benerjee: చరిత్ర నిజాలు:సురేంద్రనాథ్ బెనర్జీ తండ్రి నుండి నేర్చుకున్న ఆ విషయాల వలన జీవితం లో జరిగింది ఇదే!

Surendranadh benerjee: జాతివివక్షకు గురైన సురేందర్:
సర్ సురేంద్రనాథ్ బెనర్జీ బ్రిటిష్ రాజులు కాలంలో ఉన్న భారత రాజకీయ నాయకులలో ఒకరు.బ్రిటీష్ పరిపాలన కాలంలో ఉన్న దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నఅప్పటి తొలి రాజకీయ నాయకుల్లో సర్ సురేంద్రనాథ్ బెనర్జీ గారు కూడా ఒకరు. బ్రిటీష్ వారి కాలంలో జాతివివక్షకు గురైన సురేందర్, దానిమీద వ్యతిరేకంగా గొంతు విప్పి గొప్ప జనాకర్షణను పొందారు. ఆ విధంగా ప్రసంగాలతో ప్రజలమధ్యలో చేరిన ఆయన.. ఈ నేపథ్యంలో జాతీయవాద, ఉదారవాద రాజకీయ అంశాలతోబాటు భారతీయ చరిత్రపై కూడా బహిరంగంగా ఉపన్యాసాలుచేయడం మొదలు పెట్టారు.

Surendranadh benerjee: తనదైన సహాయాన్ని దేశానికి:

విద్యార్థి గా తాను అనుభవించిన కష్టాలు మరొక విద్యార్థి పడకూడదు అన్న భావనతో ఆయన విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలా జనాల మధ్య నుంచి వచ్చిన ఆయన.. రాజకీయా రంగ ప్రవేశం చేసి… తనదైన సహాయాన్ని దేశానికి అందించారు.

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి:

సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ అసోసియేషన్నుస్థాపించడం జరిగింది. దీని ద్వారా ఆనందమోహన్ బోస్ తో కలిసి 1883, 1885 లలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు సెషన్లకు నాయకత్వం వహించడం జరిగింది.అటు తరువాత బెనర్జీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా కూడా పనిచేసారు. కాంగ్రెస్ లాగ కాకుండా మోంటాగు-చెల్మ్‌స్‌ఫోర్డ్ సంస్కరణలను సమ్మతించారు. చాలా మంది ఉదారవాద నాయకులతో కలసి ఆయన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి , 1919 వ సంవత్సరం లో ఇండియన్ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ అనే ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసారు.

తండ్రి ఉదారవాద, ప్రగతిశీల ఆలోచనలు:

బెనర్జీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగా చెప్పబడ్డారు.సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ ప్రావిన్స్ లోని కలకత్తా లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించా రు. ఆయన తండ్రి దుర్గా చరణ్ బెనర్జీ ఒక వైద్యుడు, ఉదారవాద, ప్రగతిశీల ఆలోచనలు ఉన్నవాడు. అతని తండ్రి సురేంద్రనాథ్పై తీవ్ర ప్రభావంచూపారు అనే చెప్పాలి. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా తీసుకున్న తరువాత, ఆయన 1868 వ సంవత్సరం లో రోమేష్ చుందర్ దత్, బిహారీ లాల్ గుప్తాతో పాటు ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలను రాయడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు.

వయస్సును తప్పుగా ఉన్నకారణం గా :

సురేంద్రనాథ్1869 వ సంవత్సరం లో పోటీ పరీక్షలో విజయం సాధించినప్పటికీ, ఆయన తన వయస్సును తప్పుగా చూపించారు అనే వాదనతో ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది. పుట్టినప్పటి నుండి కాకుండా గర్భధారణ తేదీ నుంచి వయస్సును లెక్కించే హిందూ ఆచారం ప్రకారం తన వయస్సును లెక్కించాడని వాదించడం వలన కోర్టులలో ఈ విషయాన్ని క్లియర్ చేసిన తరువాత , బెనర్జీ 1871వ సంవత్సరం లో మళ్లీ పరీక్షను రాసి విజయం సాధించి , సిల్‌హెట్‌లో అసిస్టెంట్ మేజిస్ట్రేట్‌గా నియామకం కాబడ్డారు.

బెనర్జీ చదువు :

బెనర్జీ లండన్‌లోని యూనివర్శిటీ కాలేజీలో తరగతులకు కూడా హాజరయ్యారు. 1871వ సంవత్సరం లో చివరి పరీక్షలు రాసి ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చారు. 1874 వ సంవత్సరం లో, లండన్ తిరిగి వచ్చిన బెనర్జీ మిడిల్ టెంపుల్ లో విద్యార్థి అయ్యారు. చిన్న న్యాయ లోపం చేసినందుకు గాను బెనర్జీని వెంటనే తొలగించడం జరిగింది. ఆయన తన ను తొలగించడం మీద వ్యతిరేకిస్తూ అప్పీల్ చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళినకూడా అది విజయవంతం కాలేదు. దీనికి కారణం జాతి వివక్ష అని ఆయనకు అర్ధం అవడం జరిగింది.


బ్రిటీష్ వారి పట్ల విసుగు:
బెనర్జీని బ్రిటీష్ వారి పట్ల విసుగు చెంది భారతదేశానికి తిరిగి వచ్చేసారు. సురేంద్రనాథ్ ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలోఅంటే 1874–1875 , ఎడ్మండ్ బుర్కే, ఇతర ఉదార తత్వవేత్తల రచనలను అధ్యయనం చేసారు. ఈ రచనలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన నిరసనలకు మార్గాన్ని చూపించాయి. సురేంద్రనాథ్ ను ఇండియన్ బుర్కే అని కూడా పిలిచేవారు. ఇటాలియన్ జాతీయవాది అయిన గియుసేప్ మజ్జిని రచనలకు సురేంద్రనాథ్ ప్రభావితం కాబడ్డారు. ఆనంద్‌మోహన్ సూచించిన మేరకు ఇంగ్లండ్‌లో బస చేసి మజ్జిని రచనలను అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.

ఇంగ్లీష్ ప్రొఫెసర్ :

1875 వ సంవత్సరం జూన్ లో బెనర్జీ భారతదేశానికి తిరిగి వచ్చారు. మెట్రోపాలిటన్ ఇనిస్టిట్యూషన్, ఫ్రీ చర్చి ఇనిస్టిట్యూట్ 1882 లో స్థాపించిన రిప్పన్ కాలేజీ ఇప్పుడు సురేంద్రనాథ్ కాలేజీ గా మారింది అందు లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యారు . సురేంద్రనాథ్ జాతీయవాద, ఉదారవాద రాజకీయ అంశాలతో పాటు భారతీయ చరిత్రపై కూడా బహిరంగ ప్రసంగాలు చేసేవారు.సురేంద్రనాథ్ 1876 వ సంవత్సరం జూలై 26 తేదీన ఆనందమోహన్ బోస్‌తో కలసి తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించడం జరిగింది.

దేశ ప్రగతి కి అన్ని వర్గాల మధ్య ఏకత్వం:
1878 వ సంవత్సరం లో భారతీయ ప్రజల కు బోధించడానికి జరిగిన సమావేశంలో ఆయన ఈ విధం గా చెప్పారు. హిందువులు , ముస్లింలు, క్రైస్తవులు ,పరేసీల మధ్య శాంతి, సద్భావనల గొప్ప సిద్ధాంతం, మన దేశ ప్రగతి కి అన్ని వర్గాల మధ్య ఏకత్వం అనే పదాన్ని అందులో మెరిసే బంగారం అక్షరాలు గా చెక్కనివ్వండి. మా మధ్య మత భేదం , సామాజిక వ్యత్యాసం ఉండవచ్చు. అయితే మనమందరం కలుసుకునే ఒక సాధారణ వేదిక ఉంది. అదే మన దేశ సంక్షేమం వేదిక .

జాతి వివక్షను ఆయన ఖండించారు:

ఐసిఎస్ పరీక్షలు రాసే భారతీయ విద్యార్థులకు వయోపరిమితి సమస్యను పరిష్కరించడానికి ఆయన ఈ సంస్థను మొదలు పెట్టారు. భారతదేశంలో బ్రిటీష్ అధికారులు దేశవ్యాప్తంగా తమ ప్రసంగాల ద్వారా చేసిన జాతి వివక్షను ఆయన ఖండించారు. ఇది అయన బాగా ప్రాచుర్యం పొందేట్లు చేసింది.

బెంగాలీ అనే వార్తాపత్రిక:

1879వ సంవత్సరం లో,సురేంద్ర నాథ్ ది బెంగాలీ అనే వార్తాపత్రికను కూడా ప్రారంభించారు. 1883 వ సంవత్సరం లో, తన వార్తా పత్రికలో వ్యాఖ్యలను ప్రచురించినందుకు గాను బెనర్జీని అరెస్టు చేసినప్పుడు, కోర్టు ధిక్కారంలో బెంగాల్ అంతటా నిరసనలు, జరిగాయి. భారతీయ నగరాలైన ఆగ్రా, ఫైజాబాద్, అమృత్‌సర్, లాహోర్, పూణే లలో గొడవలు చెలరేగాయి. సురేంద్రనాథ్ బెనర్జీపై మోపిన కోర్టు ధిక్కరణ కేసుమీద కలకత్తా హైకోర్టులో డబ్ల్యు.సి.బెనర్జీ అయన తరుపున వాదించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ గణనీయంగా విస్తరించడం వలన కలకత్తాలో జరిగిన వార్షిక సమావేశానికి భారతదేశం నలుమూలల నుండి వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1885 వ సంవత్సరం లో బొంబాయి నగరం లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన తరువాత, బెనర్జీ 1886 వ సంవత్సరం లో వారి సాధారణ లక్ష్యాలు, సభ్యత్వాల కారణంగా తన సంస్థను అందులో విలీనం చేయవలిసి వచ్చింది. 1895 వ సంవత్సరం లో పూనాలో, 1902 వ సంవత్సరం లో అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది.

విస్తృతమైన ప్రజా మద్దతును:
1905వ సంవత్సరం లో బెంగాల్ ప్రావిన్స్ విభజనను నిరసించిన ప్రజా నాయకులలో సురేంద్రనాథ్ కూడా ఒకరు గా చెప్పబడ్డారు. ఈ ఉద్యమంలో బెనర్జీ ముందంజలో ఉన్నారు. బెంగాల్ తో సహా భారతదేశం అంతటా నిరసనలు జరగడం వలన విస్తృతమైన ప్రజా మద్దతును సంపాదించగలిగారు. ఇది చివరికి 1912 వ సంవత్సరం లో బెంగాల్ విభజనను తిప్పికొట్టడానికి గాను బ్రిటిష్ ప్రభుత్వం వారిని బలవంతం చేసింది.

పార్టీని వీడడం:

భారత నాయకులైన గోపాల్ కృష్ణ గోఖలే, సరోజిని నాయుళ్లకు బెనర్జీ పోషకునిగా మారారు. మితవాద సీనియర్-మోస్ట్ కాంగ్రెస్ నాయకులలో బెనర్జీ కూడా ఒకరు. విప్లవం, రాజకీయ స్వాతంత్ర్యాన్నికూడా ఆయన సమర్ధించారు. 1906 వ సంవత్సరం లో బాల గంగాధర్ తిలక్ నేతృత్వంలో పార్టీని వీడడం అనేది జరిగింది. స్వదేశీ ఉద్యమంలో బెనర్జీ ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండి విదేశీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ, భారతదేశంలో తయారైన వస్తువులను ప్రోత్సహించారు.

రాజకీయాల్లో బెనర్జీ పాత్ర:

మితవాద భారతీయ రాజకీయ నాయకుల ప్రజాదరణ తగ్గడం వలన భారత రాజకీయాల్లో బెనర్జీ పాత్ర ప్రభావితం కాబడింది. 1909 వ సంవత్సరం లో మోర్లే-మింటో సంస్కరణలకు బెనర్జీ తన మద్దతు తెలపడం వలన భారతీయ ప్రజా, జాతీయవాద రాజకీయ నాయకులలో చాలా మంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం తో పాటు అర్థరహితంగా ఎగతాళి చేశారు.

మహాత్మా గాంధీ ఉద్యమం ను విమర్శించడం :

మహాత్మా గాంధీ ప్రతిపాదించిన శాసనోల్లంఘన ఉద్యమం ప్రతిపాదిత పద్ధతిని బెనర్జీ విమర్శించడం జరిగింది. మోంటాగు-చెల్మ్‌స్‌ఫోర్డ్ సంస్కరణలను అంగీకరించడానికి సురేంద్రనాథ్ బెనర్జీ అంగీకారం తెలియచేసారు. కాంగ్రెస్‌ను వదలిపెట్టి ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్‌ను నెలకొల్పారు. వీరిని ఉదారవాదులు గా పిలిచేవారు. ఆ తరువాత వారు భారత జాతీయ ఉద్యమంలో తమ సాంగత్యాన్ని కోల్పోవడం అనేది జరిగింది. బెనర్జీ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రి పదవిని అంగీకరించడం జాతీయవాదులకు , ప్రజలకు కోపాన్ని కలిగిందించి.

ఓటమి:
బెనర్జీ 1923 వ సంవత్సరం లో బెంగాల్ శాసనసభ ఎన్నికలలో స్వరాజ్య పార్టీ అభ్యర్థి బిధన్ చంద్ర రాయ్ చేతిలో ఓటమి చెందారు. అన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తన రాజకీయ జీవితాన్ని ముగించవలసి వచ్చింది. బెంగాల్ ప్రభుత్వంలో బెనర్జీ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్‌ను మరింత ప్రజాస్వామ్య సంస్థగా తీర్చి దిద్దారు.

బ్రిటీష్ వారు సైతం బెనర్జీని గౌరవించడం:
భారత రాజకీయాల మార్గదర్శక నాయకుడిగా, భారత రాజకీయ సాధికారత కోసం మార్గం చూపడం వల్ల ఆయనను గౌరవిస్తున్నారు. బ్రిటీష్ వారు సైతం బెనర్జీని గౌరవించడం జరిగింది. తరువాతి సంవత్సరాల్లో సురేంద్రనాథ్ ని సురేంద్రనాథ్ బెనర్జీ అనిపిలవడం జరిగింది.

ఓటమి రాజకీయ జీవితాన్నే ముంచేసింది:
సురేంద్రనాథ్ బెనర్జీ ని 1921 వ సంవత్సరం లో సంస్కరించబడిన శాసన మండలికి సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. అదే సంవత్సరం నుండి 1924 వ సంవత్సరం వరకు స్థానిక స్వపరిపాలన మంత్రిగా పదవిలో ఉండడం అనేది జరిగింది. 1923 వ సంవత్సరం లో ఎన్నికలలో ఓటమి పాలవడం ఆయన రాజకీయ జీవితాన్నే ముంచేసింది.

మరణం :
బెనర్జీ 1925 వ సంవత్సరం లో ప్రచురించైనా ఎ నేషన్ ఇన్ మేకింగ్ ద్వారా భారీఎత్తున ప్రశంసలు అందుకున్నారు. సురేంద్రనాథ్ 1925 వ సంవత్సరం ఆగస్టు 6 న బరాక్‌పూర్‌లో మరణించడం జరిగింది.

మార్గ దర్శకుడు:
రాజకీయ సామ్రాజ్యాన్ని సమర్థించినందుకు ‘నైట్’ బిరుదుతో గౌరవింపబడారు. బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఆయన కలకత్తా మునిసిపల్ కార్పోరేషన్‌ను మరింత ప్రజాస్వామిక వ్యవస్థగా మార్చేశారు. భారత రాజకీయాల అధికారీకరణకు మొట్ట మొదటిగా బాట వేసిన వ్యక్తిగా – నేడు ఆయన్ను భారత రాజకీయాల మార్గదర్శ నాయకునిగా మరువలేని వ్యక్తిగా గుర్తుండిపోయారు. గొప్పగా శ్లాఘించబడిన ఎ నేషన్ ఇన్ మేకింగ్ అనే ఒక ముఖ్యమైన రచనను ఆయన ప్రచురించడం జరిగింది. బ్రిటీషువారు ఆయన్ను చివరి రోజుల్లో సరెండర్ నాట్ బెనర్జీగా గౌరవించడం జరిగింది.