Dussehra: దసరా పండుగ నేపథ్యంలో దేశంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పది రోజులు జరుపుకునే ఈ పండుగలలో.. కనకదుర్గమ్మ అనుగ్రహం పొందుకోవడానికి భక్తులు ఎంతో ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొంతమంది ఉపవాస దీక్షలు చేస్తుంటారు. మరి కొంతమంది రకరకాల పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందుకోవటానికి ఎంతో ఆరాటపడుతుంటారు. అంతేకాకుండా భవాని దీక్షలు మాలలు వేసి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి.. నవరాత్రులలో చాలా నిష్టగా అమ్మవారిని పూజిస్తుంటారు.
దసరా రోజులలో అమ్మవారి దర్శిస్తారని ఆమె అనుగ్రహం పొందుకోవాలని ఎవరికి వారు తమ భక్తి భావనలతో ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ఆధ్యాత్మిక చింతతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చెడుపై మంచి గెలిచే ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా. అటువంటి భక్తులకు అమ్మవారి అనుగ్రహం జీవితంలో సకల శుభాలు కలగటానికి మీకోసం ఈ స్పెషల్ వీడియో.
ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న అమ్మవారిని శుక్రవారం దర్శించుకుని లలిత సహస్రనామం చేస్తే.. సకల శుభాలతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. ఈ రకంగా ఇంద్రకీలాద్రి కొండపై కొలువైయున్న అమ్మవారు చాలామందికి తన అనుగ్రహం చూపించి వారి జీవితాలలో అనేక మంచి కార్యాలు చేశారని చెబుతారు. ఈ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది సెలబ్రిటీలు ఇంద్రకీలాద్రిలో ఉన్న దేవాలయానికి పోటెత్తుతుంటారని..టాక్.