Rajanna Sircilla : ఈ నీటిలో మునిగితే అన్నీ పాపాలూ పోతాయి .. గంగా నది వరకూ వెళ్లక్కరలేదు !

Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయాలు అయిన నాంపల్లి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలోని అసౌకర్యాలు భక్తులకు ఇబ్బందిగా మారాయి. ఆలయ కోనేరుతో పాటుగా పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడం. వలన భక్తులు తీవ్ర‌మైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ కోనేరు మురుగు, చెత్తతో నిండిపోయి దుర్గంధం రావడం జరుగుతుంది. గతంలో స్వామి వారి దర్శనానికి ముందుగా కోనేరులో భక్తులు స్నానం ఆచరించేవారు. ఇప్పుడు కోనేరు పరిస్థితులు దుర్గంధంగా మారడంతో అటునుంచి వెళ్ళడానికి భక్తులు సంకోచిస్తున్నారు. చెత్తా చెదారాలతో నిండిపోయి ఉన్న కోనేరును పట్టించుకునే నాధుడే కరువయ్యారని నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి భక్తులు నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. కోనేరులో గానీ ధర్మగుండంలో గానీ స్నానాలు ఆచరిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని భక్తుల ప్రగాఢ నమ్మకం. సిరిసిల్ల జిల్లాలో లక్ష్మి నరసింహస్వామి వారు పెరుమాల్లుగా నాంపల్లి గుట్టపై కొలువై ఉన్నారు. ప్రతిరోజు దూర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆలయంలో నిర్వహణ సరిగా లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోనేరులో నీరు పచ్చగా మారినీటిని తాకితే రోగాలు వ‌చ్చేలా పాచిపేరుకుపోయింది.

Rajanna Sircilla in water and all your sins will disappear

వెంటనే అధికారులు స్పందించి కోనేరును శుభ్రం చేపించిన తరువాత భక్తులను తీసుకురావాలని కోరుతున్నారు. ఆలయంలో అరకొరా సౌకర్యాలు: రాజన్న క్షేత్రంతో పాటు నాంపల్లి (12) లక్ష్మి నరసింహస్వామి వారికి ప్రతి ఏడాది. కోట్ల‌ ఆదాయం వస్తున్నా అభివృద్ధి చేయడంలో మాత్రం ఈ ఆలయాన్ని విస్మరిస్తున్నారు. కేవలం కనీసం భక్తుల కొరకు మంచి నీరు, మూత్రశాలలు లేకపోవడం. శోచనీయం. స్వామి వారిని దర్శించుకున్న తరువాత భక్తులు ఇక్కడే వంటలు చేసుకుంటారు. ఆలయ పరిసరాల్లో సరైన సౌకర్యాలు లేదని, చెట్ల కిందనే వంట చేసుకోవాల్సివస్తుందని చాలా ఇబ్బందులకు గురువతున్నట్లు భక్తులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి భక్తుల కొరకు వంటగదులను, ఎండావానల నుండి రక్షణగా షెల్టర్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా స్వామి భక్తులు కోరుతున్నారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.