Deepam : ఈ దీపం తో మీ ఆర్థిక కష్టాలన్నీ పరార్..!!

Deepam : ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో కష్టాలు రాకుండా. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం కావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. హిందూ శాస్త్రం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ దేవతపూజ మొదలవ్వదు.. ఏ కార్యక్రమం ప్రారంభించరు అని చెప్పవచ్చు. అందుకే ఉదయం, సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు అని ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లదు అని పెద్దలు నమ్ముతారు. శాస్త్రం ప్రకారం తప్పనిసరిగా దీపం వెలిగించడం అనేది ఒక ఆనవాయితీ. దీపం లేని పూజ అసంపూర్ణం..

కాబట్టి తప్పకుండా ప్రాచీన కాలంనుంచి గ్రహాలు లేదా దేవతలను పూజించేటప్పుడు తప్పకుండా దీపం వెలిగిస్తారు.దీపం అనేది చుట్టూ ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ ని బయటకు పంపించి.. పాజిటివ్ ఎనర్జీ ని పెంచుతుంది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు పంచముఖ దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. హనుమంతుడి ముందు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల స్వామివారి ఆశీస్సులు మనపై ఉండి ఇంట్లో ప్రతికూల శక్తులు దూరమవుతాయి . అంతేకాదు ఆనందం , శ్రేయస్సు , ఆర్థిక సంపద పెరుగుతుంది. ముఖ్యంగా పంచముఖ దీపాన్ని ఆవునెయ్యితో మాత్రమే వెలిగించాలి.

Overcome all your financial difficulties with this Deepam
Overcome all your financial difficulties with this Deepam

ఇలా స్వచ్ఛమైన ఆవునెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోనీ వాస్తు దోషాలు కూడా తొలగి పోయి ఆ ఇంట్లో ధన ధాన్యాలు, సిరి సంపదలు తులతూగుతాయి.ప్రతిరోజు ఉదయం , సాయంత్రం పంచముఖ దీపం పెట్టి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా వెలిగించాలి. ఇక ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది , డబ్బుకు .. ఆహారానికి ఎప్పుడు కొరత ఏర్పడదు. ఇక ఒక వ్యక్తికి చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ పంచముఖ దీపం వెలిగించాలి . అప్పుడు ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక సంపద పెరుగుతుంది.