Shivudu : శివుడిని ఇలా పూజిస్తే చాలు.. ధనవంతులు అయినట్లే..!!

Shivudu : పరమేశ్వరుడిని ఐశ్వర్య ఈశ్వరుడు అని పిలుస్తారు. ముఖ్యంగా ఈశ్వర అంటే ఐశ్వర్యం అనే శబ్దం వినిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుని మనం పూజించినట్లయితే ధనయోగం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మొండి బాకీలు వంటి సమస్యల నుంచి కూడా పరమశివుడు మనలను కాపాడతాడు. జన్మరాశి , నామ రాశి ని బట్టి శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయించాలి. ప్రత్యేకమైన పుష్పాలతో స్వామివారిని అలంకరించి అత్యద్భుతమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల స్వామివారు ప్రసన్నం చెంది మనకు ఆయన ఆశీస్సులు అందిస్తారు.

ముఖ్యంగా మేష రాశి వారు బెల్లం ముక్క నీళ్లలో కలిపి శివుడికి అభిషేకం చేయాలి. గన్నేరు పూలతో పూజ చేసి.. శివునికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే పరమశివుడి అనుగ్రహం మీపై ఉంటుందివృషభ రాశి , కర్కాటక రాశి వారు ఆవు పెరుగుతో అభిషేకం చేసి .. తెల్ల జిల్లేడు పూలతో అలంకరించి.. పంచదార నైవేద్యంగా సమర్పించాలి.మిధున రాశి వారు చెరుకు రసంతో అభిషేకం చేసి.. గరికపోచలు, జమ్మి ఆకులతో పూజ చేసి.. పెసరపప్పు పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి.సింహ రాశి వారు బెల్లం నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి.. ఎర్రటి మందారాలతో పూజించాలి.

It is enough to worship Shivudu as if rich
It is enough to worship Shivudu as if rich

ఇక స్వామివారి అనుగ్రహం పొందడానికి గోధుమ రవ్వ తో తయారు చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా పెడితే ధన భాగ్యం కలుగుతుంది.కన్య రాశి వారు చెరకు రసంతో అభిషేకం చేసి.. తమలపాకులతో శివ పూజ చేయాలి. అలాగే పెసరపప్పు తో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే వారికి రాజయోగం కలుగుతుంది.తులారాశి వారు స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళలో సెంట్ కలిపి స్వామివారికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత తెల్లటి పువ్వులతో పూజ చేసి.. పెరుగు, తేనె, పాలకూర వంటివి నైవేద్యంగా సమర్పిస్తే వారికి తిరుగులేని ధన ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.