Vishal : కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోలలో విశాల్ కూడా ఒకరు. తాజాగా తను నటించిన లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్నటి రోజున చెన్నైలో చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు విశాల్. ముఖ్యంగా తన పొలిటికల్ ఎంట్రీ పై కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.
విశాల్ మాట్లాడుతూ.. చంద్రబాబుతో పోటీ గురించి తెలియజేస్తూ నేను రాజకీయాలలోకి రావడం అనేది కచ్చితంగా జరుగుతుంది. అది కేవలం సామాజిక సేవ లక్ష్యంగానే అని తెలియజేశారు. ఎన్నికలలో పోటీ చేస్తానని తన రాజకీయ ప్రవేశం గురించి తెలియజేశారు. కానీ కుప్పం నుంచీ పోటీ గురించి మాట్లాడుతూ కుప్పం ప్రజలతో తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధము వుంది. ఏమిటంటే తన తండ్రి గారు అక్కడ గ్రానైట్ బిజినెస్ చేసేవారని తెలిపారు.
దాంతో మూడేళ్లపాటు అక్కడే ఉన్నామని తెలిపారు. అయితే 2024 ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబు పైన పోటీ చేస్తానని వచ్చిన వార్త అవాస్తవమని తెలియజేశారు. ఇక తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడే చేసుకునే ఉద్దేశం లేదంటూ తెలియజేశారు విశాల్. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.