Tollywood Actors Diseases : వెండితెరపై వినోదం పంచే స్టార్స్ కి ఎలాంటి బాధలు ఉండవు అని మనం అనుకుంటాం. కాని వారు అన్ని బాధలని మనసులో దాచుకొని మనకు వినోదం పంచుతూ ఉంటారు. రీసెంట్ గా అందాల ముద్దుగుమ్మ సమంత అరుదైన వ్యాధితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మయోసైటిస్తో బాధపడుతున్నట్టు తెలియజేసిన సమంత ప్రస్తుతం అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటుంది. ఇక జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ సైతం ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.
ఎన్నో కష్టాలు..
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుదీప్..తనకు హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్ఎస్పీ) అనే డిజార్డర్ ఉందని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇది కామన్ గా చాలా మందిలో ఉంటుంది కానీ పెద్దగా బయటపడదు అని చెప్పుకొచ్చారు. తాజాగా బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ కూడా తనకు అరుదైన వ్యాధి వచ్చినట్టు వెల్లడించాడు. తను వెస్టిబులర్ హైపోఫంక్షన్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వ్యాధి ఉన్నట్లు ఆ మధ్య చేసిన వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాధి లక్షణాలు మగతగా ఉంటడం, శరీరం బరువు కోల్పోవడం లాంటివి గా ఉంటాయట. ఇవే కాక చూపు మందగించడం, వినికిడి లోపం కూడా ఏర్పడుతుంటుందట. ఇక ఈ వ్యాధి గురించి తెలియడంతో వరుణ్ ఫ్యాన్స్ కలవరానికి గురవుతున్నారు. తమ అభిమాన నటుడి పరిస్థితి ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. ఈ వ్యాధి వలన ఇప్పుడు తన అలవాట్లను మార్చుకుంటున్నాడట, యోగా చేయడంతో పాటు చికిత్స తీసుకుంటున్నా అని వరుణ్ అన్నారు. తన కోసం ఎవరూ బాధపడవద్దని.. తనను ప్రేమిస్తున్న అభిమానులకు ఆయన తెలియజేశారు.