Balakrishna : మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత సినిమాలకి కొంతకాలం బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. రాజకీయాల కంటే సినిమాలే తనకు ఇష్టం అంటూ.. 10 సంవత్సరాల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మంచి విజయం సాధించారు. ఈ సినిమా తమిళనాడు కత్తి మూవీకి రీమేక్ గా వివి వినాయక్ తెలుగులో తెరకెక్కించారు.. పదేళ్ల తర్వాత అయినా చిరంజీవికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని ఈ సినిమాతో నిరూపించుకున్నారు..
పది సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వచ్చి తనదైన క్రేజీని మరోసారి నిరూపించుకున్నారు.. ఈ సినిమా తర్వాత భారీ అంచనాలనుడుమ “సైరా నరసింహారెడ్డి” విడుదల చేశారు.. ఈ సినిమాతో ప్రత్యేక పాత్రలో చిరంజీవికి గురువుగా అమితాబచ్చన్ నటించారు.. తదితర పాత్రలో తమిళనాడు విజయ్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా భారీ విజయాన్ని సాధించలేకపోయింది.. ఆచార్య అనే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో.. కొరటాల శివ డైరెక్షన్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో మొదటిసారిగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో నటించడం అభిమానులకు ఎంతగానో ఆసక్తి రేపింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది..
![Balakrishna : ఈ ఒక్క కారణం చాలు చిరంజీవి కంటే బాలయ్య 100 రెట్లు తోపు అని చెప్పడానికి.. This reason alone is enough to say that Balayya is 100 times better than Chiranjeevi](https://dailytelugunews.com/wp-content/uploads/2022/09/47.jpg)
తాజాగా చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీ లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒక అతిధి పాత్రలో నటించారు.. వాల్తేరు వీరయ్య అనే కీలక పాత్రలో రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.. ఎన్నడు లేని విధంగా చిరంజీవి కొత్తగా ఇలాంటి సినిమాలు చేస్తున్నారేంటి అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను ఆన్లైన్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సోలాగా ఉన్నప్పుడే భారీ విజయనందుకున్నారని వ్యక్తం చేస్తున్నారు.. చిరంజీవి సహనటుడైన నందమూరి బాలకృష్ణ ఎటువంటి మల్టీ స్టార్లు లేకుండా సింగిల్ గానే విజయం సాధిస్తున్నారు.. చిరంజీవి మాత్రం ఆయన ఎంతో క్రేజ్ ఉంచుకొని కూడా ఇలా మల్టీస్టారర్ మూవీస్ చేయటంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..