Pawan Kalyan : రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల వైపు వెళ్ళకూడదు అని అనుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ఓటమి రావడం తో పార్టీ ని నడిపించడానికి మళ్ళీ ఆర్థికంగా బలపడటానికి సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. పవర్ స్టార్ ఒక వైపు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నా కూడా ఒప్పుకున్నా సినిమాల ను పూర్తి చేయాలని భావించారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి సీరియస్ గా మారుతూ ఉండడంతో పవన్ సినిమా షూటింగ్స్ కు సమయం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణం గా నిర్మాత లు కాస్త ఇబ్బంది పడవలిసి వస్తుంది. అయినా కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో వాళ్లు పరిస్థితి అర్ధం చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ప్రపోసల్ వచ్చినప్పుడు తన పరిస్థితుల గురించి వివరించి చెప్పిన తర్వాతనే అడ్వాన్స్ తీసుకుంటున్నారట. ఈ కారణం తో నిర్మాతలు పవన్ సమయాన్ని బట్టి షూటింగ్ పెట్టుకుని అయినంత వరకు షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్నారు.
2024 ఎన్నికల దృష్ట్యా పవన్ కళ్యాణ్ మరింత బిజీ అవక తప్పదు కాబట్టి ఒకే ఒక ఒక్క సినిమా షూటింగ్ లో మాత్రమే పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారట. క్రిష్ దర్శకత్వంలో తీస్తున్న హరిహర వీర మల్లు సినిమా ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నారట. ఆ సినిమాను కాకుండా ఇతర సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ఇక భవదీయుడు భగత్ సింగ్ సినిమా నిర్మాతతో పాటు మరొక రీమేక్ సినిమా కూడా చేద్దాం అనుకున్న పవన్ ఇప్పుడు ఆ ఇద్దరు దర్శక నిర్మాతలకు కూడా డైరెక్ట్ గా చెప్పేసినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికలు అయ్యే వరకు సినిమా చేయలేను అని ఆలోపు మీరు ఏదైనా సినిమాలు చేయాలనుకుంటే చేసుకోండని చెప్పేసినట్టు తెలుస్తుంది. కుదరని పక్షం లో అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారట. పరిస్థితి ఇలా ఉండగా పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ ను అనుకున్న సమయానికి ఎంతవరకు పూర్తి చేయగలుగుతారో చూడాలి.