Sri Reddy – Chiranjeevi : శ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీపై తరచూ ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.. శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ లో మెగాస్టార్ పై రాసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాను చదువుతున్న నర్సాపురం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. కేవలం మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరవ్వడం కోసమే నర్సాపురం లో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఖైరతబాద్ లో ఏర్పాటు చేశారని చెబుతాన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన అనుభవాలు చెబుతూనే రాజకీయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజకీయాల్లో రాణించాలి అంటే చాలా రాటు తేలి ఉండాలని అనడానికైనా అనిపించుకోవడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. నేను రాజకీయాల్లో రాణించలేకపోయాను గాని పవన్ మాత్రం అనడానికి అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు మంచి స్థానంలో నిలబడతారని చెప్పారు. ఇక ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి గతంలో జగన్ ను కలిసిన ఫోటో షేర్ చేస్తూ ఆమె దారుణమైన కామెంట్స్ చేసింది ఆమె చేసిన వ్యాఖ్యలు యధాతధంగా మీకోసం.. ఈ పక్కనున్నాడు దొంగ బాడకవ్ అని ఎప్పుడో చెప్పా విన్నారా జగనన్న.. వీడు ఇప్పుడు తొందరపడి ముందే కూసాడు. ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు. ఈ వెధవ పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట. ఇంకోసారి ఈ విషపురుగు గాడు మీ పక్కన నిలబడడం నేను చూడకూడదు అంతే ఇట్స్ మై ఆర్డర్ అని అనే అంత సీన్ నాకు లేదు కానీ .. ఆర్డరే అంటూ రాసుకుంది శ్రీరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా సపోర్ట్ చేయడంతో శ్రీ రెడ్డి ఈ విధంగా కామెంట్స్ చేసింది.