Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ పర్సన్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తుంటాడు. కరోనా సమయంలో పిల్లలతో కలిసి సరదాగా గడిపాడు. చిన్న పిల్లాడిలా మారి మహేష్ బాబు చేసిన సందడి ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. మఖ్యంగా మహేష్ తన కూతురు సితారతో ఎంతో విలువైన సమయాన్ని గడుపుతాడు. ఇటీవల ఆమెతో కలిసి పలు షోలకి హాజరు కావడం, సితార టాలెంట్ చూసి మురిసిపోవడం వంటివి చేస్తున్నాడు. దీపావళి సందర్బంగా సితార భరతనాట్యం డ్యాన్స్ వీడియో షేర్ చేశాడు.
పాపం సితార..
ఈ వీడియోని షేర్ చేస్తూ.. నువ్వు నన్ను గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు సితార. మై లిటిల్ వన్ అంటూ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు మహేష్. అయితే మహేష్ ఇటీవల తన తల్లిని మిస్ అయిన దగ్గర నుండి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఇందిరా దేవి మరణం సమయంలో తల్లిని తలచుకుంటూ అలా బాధలోనే ఉన్న మహేష్ ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు. అయితే మరణం అనంతరం చేయాల్సిన కార్యక్రమాలన్నీ మహేష్ పూర్తి చేశాడు.ఇక సోలోగా మహేష్ విదేశాలకి వెళ్లాడట. సాధారణంగా ఫారెన్ టూర్ ఎప్పుడు వేసిన కూడా మహేష్ బాబు ఫ్యామిలీని వెంట తీసుకెళతాడు. కాని ఈ సారి అలా జరగలేదు.
మహేష్ బాబు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముందు అన్న రమేష్ బాబు అనారోగ్య కారణాలతో మరణించడం, ఆ తర్వత తల్లి ఇందిరా దేవీ స్వర్గస్తులు కావడంతో మహేష్ బాబు ఫారెన్ వెళ్లి అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ అద్దెకు తీసుకొని ఏకాంతంగా ఉంటున్నాడట. ఈ విషయం తెలుసుకొని సితార చాలా ఏడుస్తుందట. తండ్రి తనని వదిలేసి ఇన్ని రోజులు దూరంగా ఉండడం సితార ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుందట. సరిగా తినక,నిద్ర పోక తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తుందట. సితార పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తున్నారు. మహేష్కి బాధ ఉన్న విషయం సరే కాని, కూతురి బాధని కూడా కొంత అర్ధం చేసుకుంటూ బాగుండేదని కొందరు హితవు పలుకుతున్నారు.