Samantha : అభిమానులకు షాక్ ఇస్తూ.. అతిపెద్ద నిర్ణయం తీసుకున్న సమంత..!

Samantha :  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సమంత.. ఇటీవల మయోసైటీస్ అనే వ్యాధి వచ్చి మరింతగా ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఆమెకు ఈ వ్యాధి వచ్చింది అని తెలియగానే అభిమానులు పడిన కంగారు మాటల్లో చెప్పలేము. ఎప్పుడు ఆమె బయటకు వస్తుందా తన ఆరోగ్యం బాగుందని చెబుతుందా అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూశారు.

Kushi movie good news tells Samantha
Kushi movie good news tells Samantha

ఇకపోతే హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఆమె సొంతం. పైగా ఇప్పుడు సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకుంది . రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఫ్యామిలీ మెన్ టు వెబ్ సిరీస్ తో ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వయసు ఆఫర్లు అందుకుంటుంది. ముంబైలో కూడా సపరేట్గా ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేసింది ఈ ముద్దుగుమ్మ ..

ఇప్పుడు అభిమానులకు షాక్ ఇస్తూ అతిపెద్ద నిర్ణయం తీసుకుంది సమంత.. అసలు తమిళ్ సినిమాల కంటే ఇప్పుడు బాలీవుడ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయిందట . తన అడ్రస్ కూడా కేరాఫ్ ముంబై అని చెబుతోంది. ఎక్కువగా అక్కడ దర్శక నిర్మాతలతోనే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజు డీకే దర్శకత్వంలో వస్తున్న సిటాడెల్ సిరీస్ తో బిజీగా ఉంది.

మరొకవైపు విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది అయితే ఈమె ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే బాలీవుడ్కే పరిమితం కానుందట. అందుకే పుష్ప 2లో అవకాశం వచ్చిన సరే ఒప్పుకోలేదని సమాచారం. ఏది ఏమైనా దక్షిణాదితో బంధం తెంపుకొని .. బాలీవుడ్తో అదే బంధం పెనవేసుకోవాలని చూస్తోంది సమంత. మరి ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.