Keeravani : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎం ఎం కీరవాణి తల్లి తాజాగా తుది శ్వాస విడిచినట్లు సమాచారం. బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఎంఎం కీరవాణి తల్లి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
![Sad moment happen in keeravani's house..!](https://dailytelugunews.com/wp-content/uploads/2022/12/M._M._Keeravani_at_Inji_Iduppazhagi_Audio_Launch-300x200.jpg)
ఎంఎం కీరవాణి దర్శక ధీరుడు రాజమౌళికి స్వయానా సోదరుడు అవుతారన్న విషయం తెలిసిందే. ఇక పిన్ని మరణంతో రాజమౌళి కూడా ఆమె పార్థివ దేహాన్ని సందర్శించడానికి అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎంఎం కీరవాణి ఇప్పుడు తన తల్లిని కోల్పోయి మరింత కృంగిపోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజును కోల్పోగా.. మహేష్ బాబు తల్లి తండ్రి అన్నను కోల్పోయారు. ఇప్పుడు ఎం ఎం కీరవాణి కూడా తల్లిని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది.