Mahesh – Trivikram : అతడు,ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సజావుగా షూటింగ్ జరుగుతుందనుకున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో కథానాయికగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ ఛాన్స్ పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలకు ఛాన్స్ దక్కింది అని అంటున్నారు. మరో విశేషం ఏమిటంటే సీనియర్ నటి శోభన మహేష్ తల్లిగా నటించనున్నట్టు ఓ టాక్ కూడా నడుస్తుంది.
తెలుగులో శోభన చివరి చిత్రం ‘గేమ్ కాగా, . మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన ఈ మూవీలో ఆమె మోహన్ బాబు భార్య పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు మహేష్ తల్లిగా ఆమె నటిస్తున్నారనే వార్త ఒకింత ఆసక్తి రేపుతోంది. ఇక 2023 సమ్మర్ కానుకగా త్రివిక్రమ్-మహేష్ మూవీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కాని, ఆ సూచనలు మాత్రం కనిపించడం లేదు. వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిలే అవుతుండడంతో మూవీ మరింత ముందుకు పోనుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా వలన నిర్మాతకు చాలా నష్టాలు వస్తున్నట్టు తెలుస్తుంది.
పాన్ ఇండియా స్థాయిలో మూవీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్క్రిప్ట్ కి ఇటీవల చాలా మార్పులు చేర్పులు చేశారట. దీంతో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొత్తం వేస్ట్ అయ్యిందని అంటున్నారు. ఎన్నో సెట్స్, నటీనటుల కాల్షీట్స్ ఇవన్నీ కలిపి చూస్తే బడ్జెట్ కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొత్తం క్యాన్సిల్ చేస్తే మూవీ విడుదలకు ముందే నిర్మాత సూర్యదేవర నాగవంశీకి నష్టం వచ్చినట్టే అని అంటున్నారు. పాన్ ఇండియా సబ్జెక్టుగా చేద్దామనే ఆలోచన త్రివిక్రమ్ దే అయినప్పటికీ దానికి మహేష్ కూడా మద్దతు తెలపడంతో ఇప్పుడు బడ్జెట్ కూడా మించిపోతుందని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.