Prabhas Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆదిపురుష్. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ చేయాలని సర్వం సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాపై వస్తున్న వార్తలతో ప్రభాస్ ఫ్యాన్స్ కు గుండె పగిలిపోయే వార్తేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే అనౌన్స్ చేశారు. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12 న ఆదిపురుష్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఈ సినిమా టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. అలాగే విపరీతమైన ట్రోల్స్ కి గురైంది.
ఇక ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు 35000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని కూడా టాక్ వినిపించింది. కాని ఆదిపురుష్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపస్తుంది. అందుకు కారణం సినిమాలో నాసిరకం గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం,వీఎఫ్ఎక్స్ సరిగా లేకపోవడం వలన చిత్రాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేసి మళ్లీ ఫ్రెష్ ఔట్ పుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇటీవల టీజర్ విడుదల కాగా, ఆటీజర్పై ఎన్ని విమర్శలు వచ్చాయో మనం చూశాం. ఇలానే సినిమా విడుదల చేస్తే ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కావడమే కాక చిత్ర బృందంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడం ఖాయం. అందుకని చిత్రాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని అనుకుంటున్నారట.
Prabhas Adipurush ; ఆదిపురుష్ మూవీ రిలీజ్ వాయిదా
ఇప్పుడు బాలీవుడ్ టు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆదిపురుష్ వాయిదా పడుతుందనే వార్త మరింత వైరల్ అవుతుంది. సినిమా మొదలైనప్పటి నుండి వాయిదా పడుతుందంటూ పలు రకాల వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మూవీ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశం లేదని కూడా కొందరు అంటున్నారు. ఈ మూవీ కోసమే ఫిల్మ్ టీమ్ కంటిన్యూగా వర్క్ చేస్తున్నారని అంటున్నారు. ఈ మూవీకి ఫిల్మ్ టీమ్ 500 కోట్ల బడ్జెట్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తారా లేదా అనే విషయంపై మేకర్స్ ఏమంటారో చూడాలి. ఆదిపురుష్ మూవీలో రాముడుగా ప్రభాస్, సీతగా కృతిసనన్ యాక్ట్ చేయగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ యాక్ట్ చేస్తున్నారు.