Prahas : ప్రభాస్ ఆదిపురుష్ కొత్త ట్రైలర్.. నరేంద్ర మోడీ చేతుల మీదుగా విడుదల.??

Prahas : ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆదిపురుష్.. రామాయణం ఇతిహాసం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఓమ్ రౌత్.. ఈ సినిమాలో రాముడి గా ప్రభాస్.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్.. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదలవుగా విపరీతమైన నెగెటివిటీని సొంతం చేసుకుంది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుందని.. అది కూడా ప్రధానమంత్రి చేతుల మీదగా అంటూ.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Prabahs adipurush trailer lunch on PM Narendra Modi
Prabahs adipurush trailer lunch on PM Narendra Modi

ఇటీవల విడుదలైన టీజర్ లో రాముడి పాత్ర తప్ప మిగతా అందరి గురించి రకరకాల వాదనలు వినిపించాయి. ఈ టీజర్ పై మీమ్స్ ట్రోల్స్ అయ్యాయి. కోర్టులో పిటిషన్లు కూడా దాఖలాలు అయ్యాయి.. ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ కి కూడా కోర్టు నుంచి నోటీసులు అందాయి.. అయితే ప్రభాస్ దర్శకుడు ఓమ్ రౌత్ ఇద్దరు కూర్చుని ఈ సినిమాలో ఎక్కడెక్కడ తప్పులు చేసామో దగ్గర ఉండి చర్చించుకున్నారట. అందుకు తగిన మోడిఫికేషన్ కూడా చేశారట .ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ ట్రైలర్ ను మళ్లీ గ్రాండ్ గా విడుదల చేయాలని ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.. ఈసారి ఈ సినిమా ట్రైలర్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట..

ప్రధాని మోడీ బిజెపి పార్టీ. ప్రభాస్ కి కూడా బిజెపి అధిష్టాన నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా ట్రైలర్ ను ఈసారి ప్రధానమంత్రి చేతుల మీదగా విడుదల చేయాలని ప్రభాస్ ఆలోచిస్తున్నారట. ఈ మేరకు అమిత్ షాను కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమా టీజర్ పై సొంతం చేసుకున్న నెగిటివిటీ.. ఈ సినిమా ట్రైలర్ తో అంతకంటే ఎక్కువ పాజిటివిటీని.. ఈ సినిమాపై క్రియేట్ చేయాలని ఈ విధంగా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారని టాక్..