Namratha : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే.. కృష్ణ దశదిన కార్యక్రమం నవంబర్ 27న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ భోజన ఏర్పాట్లు చేశారు. సినీ రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5000 పాసులు అందించారు. ఈ విందులో 30 రకాల వంటకాలు వడ్డించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ భావోద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు..
మా నాన్నగారు నాకు ఎన్నో ఇచ్చారు ఆయన ఇచ్చిన వాటిలో అన్నింటికన్నా గొప్పది మీ అభిమానం. అందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పటికీ నా హృదయంలో మీ హృదయంలో నిలిచే ఉంటారు. నాన్నగారు ఎప్పటికీ మన మధ్య ఉంటారు అభిమానుల్ని కలుసుకోవడం ఆనందాన్ని కలిగిస్తోంది నాపై మీ అభిమానం మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను అంటూ మహేష్ ఎమోషనల్ అయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం జరిగిన 24 గంటల్లో నమ్రత ఎవరు ఊహించని విధంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.. సూపర్ స్టార్ కృష్ణ పేరు మీద ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి అందులో చిన్న చిన్న సినిమాలు ప్రోత్సహించాలి అని నమ్రత బలమైన నిర్ణయం తీసుకుందట. ఇప్పటి వరకు కృష్ణ ఎన్నో ప్రయోగాలు చేయగా.. ఆ బాటలోనే నడిచే ఎందరికో కృష్ణ పేరు మీద సహాయం అందించాలని నమ్రత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.