Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే.. వారి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. పుష్కరకాలం తర్వాత వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమాకు ముహూర్తం కుదిరింది. మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇక రెండో షెడ్యూల్ ఆలస్యం అవ్వడంతో.. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త పుట్టుకొచ్చింది.
ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలు పెట్టాలంటే కచ్చితంగా పూజ రావాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ కాబట్టి.. మహేష్ పూజ హెగ్డే కాంబినేషన్ లో ఈ షెడ్యూల్ ఉంటుందట. అయితే పూజ ఫంక్షన్ కి వెళ్ళగా అక్కడ తన కాలు మెలికపడి కింద పడటంతో గాయమైంది. దాంతో ఆమెను డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. ఆమె ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటుందో తెలియదు. ఆ తరువాత స్కాన్ చేయించుకుని కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత కానీ మళ్ళీ తను సెట్స్ లోకి రాదని అంటున్నారు. అసలు ఆమె ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ ఇవ్వగా చిత్ర యూనిట్ కి చుక్కలు చూపిస్తోందట.
పూజ హెగ్డే వస్తే డిసెంబర్ లోనైనా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చు. లేదంటే ఇంకా వాయిదా పడింది అని తెలుస్తోంది. ఏ ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారో కానీ ఏదో ఒక కారణం చేత వెనక్కి వెళ్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు మహేష్ బాబుకి స్క్రిప్ట్ లో డౌట్స్ ఉన్నాయని.. ఆ డౌట్స్ ను త్రివిక్రమ్ క్లారిఫై చేయలేకపోయారని అన్నారు. ఇప్పుడు పూజ హెగ్డే దెబ్బతో షూటింగ్ మరింత ఆలస్యంగా కానుందని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.