Mahesh Babu : మాషేషా మజాకానా..!! ఫాన్సీ నంబర్ పట్టేశాడుగా..!

Mahesh Babu :ఒకప్పటిలా కాదు ఇప్పుడు అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే.. హంగు హార్భాటాలు ఉన్న సినిమాలే.. థియేటర్ నుంచి వచ్చే కలెక్షన్స్ ఈ సినిమాని ప్రాఫిట్ జోన్ లో పడేస్తాయా.. అంటే చెప్పలేని పరిస్థితి అందుకే సినిమా ప్రేక్షకుల నుంచి దర్శకుల వరకు అందరూ ఓటీటీ బాటే పట్టేస్తున్నారు.. అక్కడ భారీ లాభాలను గడిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ కూడా తన నెక్స్ట్ సినిమాకి భారీ అండ్ ఫ్యాన్సీ నెంబర్ ను పట్టేసాడు.. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ సినిమా..

హిట్ పేరుగా పేరు సంపాదించుకున్న మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న #SSMB28 సినిమా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పరుగులు పెట్టేస్తున్నాడు త్రివిక్రమ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఓ హాట్ న్యూస్ తో నెట్టింట వైరల్ అవుతుంది.

మహేష్ త్రివేక్రమ్ కాంబోలో రానున్న సినిమా షూటింగ్ కి ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ తో భారీ డీల్ ని కుదుర్చుకుందట. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ను 80 కోట్లకు సొంతం చేస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో మేకర్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ న్యూస్ తెలిసిన మహేష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక సెకండ్ హీరోయిన్ గా శ్రీలేలా కూడా నటిస్తోందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం.