Mahesh Babu : టాలీవుడ్ స్టార్ క్యూట్ కపుల్ గా నమ్రత మహేష్ గుర్తింపు తెచ్చుకున్నారు.. నమ్రత మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకి దూరంగా ఉన్నా.. మహేష్ బాబు సినీ, ఆర్థిక వ్యవహారాల్ని తెరవెనుక ఆమె చూసుకుంటోంది. ఇప్పటికే ఏషియన్ గ్రూప్తో కలిసి థియేటర్ని నిర్వహిస్తున్న మహేష్ బాబు.. అదే గ్రూప్తో కలిసి ఇటీవల ఓ హోటల్ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రెండు బిజినెస్ వ్యవహారాల్ని నమ్రత పర్యవేక్షిస్తోంది. తాజాగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది..
నేను మోడలింగ్ లోకి వచ్చిన కొన్ని రోజులకే నాకు బోర్ కొట్టింది. ఇక సినిమాల వైపు అడుగులు వేసుకుంటూ వచ్చాను. వంశీ సినిమాలో మొదటి సారి మహేష్ బాబుని కలిశాను. ఆ తర్వాత మా అభిప్రాయాలు కలిసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మహేష్ కి తన భార్య ఎలా ఉండాలో ఓ స్పష్టమైన క్లారిటీ ఉంది. అతని అభిప్రాయాన్ని గౌరవించి నేను సినిమాలకి దూరమయ్యా అని నమ్రత చెప్పింది.
మహేష్ బాబు ఇంట్లో పిల్లలతో ఎలా ఉంటారు అని అడుగగా.. పిల్లలు వాళ్లకి ఏం కావాలన్నా మహేష్ నే అడుగుతారు. దానికి మహేష్ వెంటనే ఎస్ చెబుతాడు.. నేను మాత్రం నో చెబుతా.. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య తరచూ సరదా గొడవలు జరుగుతుంటాయి.. అంతే తప్ప.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మా మధ్య గొడవలు రావు’’ అని నమ్రత తెలిపింది.. మహేష్ నటించిన సినిమాల్లో నాకు పోకిరి సినిమా బాగా ఇష్టమని తెలిపారు.