Mahesh Babu : షూటింగ్ లో పాల్గొనబోతున్న మహేష్ బాబు .. కానీ..?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత మంచి మంచి విజయాలు అందుకుంటూ ఎంతోమంది డైరెక్టర్లకు స్టార్ పొజిషన్ ను అందించిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు తన అందం తోనే ఎంతో మంది అమ్మాయిల మనసులను దోచుకున్నాడు.. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే 60 శాతం షూటింగ్ పూర్తి కాగానే స్పెయిన్ లో తన మోకాలికి సర్జరీ చేయించుకుని.. దుబాయ్ కి వెళ్లి కొన్ని రోజులపాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు.

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకొని తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ తీసుకున్నాడు.. అయితే తన అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో చివరి చూపుకు కూడా నోచుకోని మహేష్ బాబు పెద్దకర్మ సమయంలో మాత్రమే బయటకు వచ్చారు. పెద్ద కర్మ కి రెండు రోజులకు ముందు మహేష్ బాబు కు నెగిటివ్ వచ్చింది అన్న విషయం తెలిసిందే.. ఆ రోజు నుంచి ఆయన ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ త్వరలోనే సర్కారు వారి పాట షూటింగ్లో మిగిలిన 40 శాతం షెడ్యూల్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు..

Mahesh Babu going to participate in the shooting but
Mahesh Babu going to participate in the shooting but

దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమాకి నిర్మాతలుగా మైత్రి మూవీ మేకర్స్ తో పాటు జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14రీల్స్ ప్లస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. అయితే ఈ రోజు షూటింగ్ ప్రారంభం కానుండగా కొన్ని అనివార్య కారణాలవల్ల ఫిబ్రవరి రెండవ వారంలో షూటింగులో జాయిన్ కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వేగంగా అన్ని పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ ఒకటవ తేదీన సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.