Khushbu : ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..!

Khushbu : కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కుష్బూ .. ఆ తర్వాత తమిళ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా నిలిచిపోయింది. అంతేకాదు ఈమె అందానికి , నటనకు ఫిదా అయినా తమిళ్ తంబీలు ఈమె కోసం గుడి కూడా కట్టించారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో ఖుష్బూ కి ఏ రేంజ్ లో గుర్తింపు లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తెలుగులో శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో మళ్లీ నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

Khushbu home happened a sad moment..!
Khushbu home happened a sad moment..!

ప్రస్తుతం జబర్దస్త్ వంటి బుల్లితెర షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండే ఈమె ఇంట్లో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళితే ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్.. గత కొంతకాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే తాజాగా ఆయన తుది శ్వాస విడిచినట్లు తమిళ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. చిన్ననాటి నుంచి తన అన్నయ్యతో ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపిన ఈమె ఒక్కసారిగా ఆయన మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. ఏది ఏమైనా కుష్బూ బాధను చూసి ప్రతి ఒక్కరు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాను మరి కొంత మంది ఆమె అన్నయ్య మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.