Mahesh Babu : మహేష్ అభిమానులకు బాడ్ న్యూస్..ఈ ఏడాది మూవీ లేనట్టేనా..?

Mahesh Babu  : పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో తన మూడవ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గతంలో మహేష్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు సినిమా మాత్రం పూర్తవలేదు. కారణం గత ఏడాది సెప్టెంబర్లో తల్లి ఇందిరాదేవి మరణించడం.. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడం అన్నీ ఒక్కొక్కటిగా ఆయనను మరింత మానసికంగా ఇబ్బందులకు గురిచేసాయి. దాంతో సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.

Is That Mahesh Babu movie may be postponed
Is That Mahesh Babu movie may be postponed

అయితే త్వరగా ఇప్పటికైనా షూటింగులు కంప్లీట్ చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకు తగ్గట్టుగా షూటింగులు కూడా శరవేగంగా జరిపారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న మూవీ షూటింగ్ నిలిపివేయబడిందని తెలుస్తోంది. ఆగస్టు లో విడుదల కావాల్సిన సినిమాని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారట. మరొకవైపు త్రివిక్రమ్ తో సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో హాలీవుడ్ టెక్నీషియన్స్ నడుమ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు మేకర్స్.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయి అని ఆరు నెలల పాటు టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ముందుగానే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి . ఇకపోతే త్రివిక్రమ్ తో సినిమా పూర్తవలేదు కాబట్టి రాజమౌళితో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మహేష్ అభిమానులు కొంతవరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎవరైనా ఇస్తారేమో చూడాలి. దానికైతే మహేష్ మూవీ ఈ ఏడాది లేనట్టే అని తెలుస్తోంది.