Mahesh Babu : రెచ్చిపోతోన్న దిల్ రాజు కి భారీ షాక్ ఇచ్చిన మహేష్ బాబు !

Mahesh Babu : దిల్ రాజు పేరు గతకొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.. ఈయన సినిమాల నిర్మాణంతో పాటు నైజాం, వైజాగ్ ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఆయనకు నైజాంతో పాటు ఉత్తరాంధ్రలోనూ పెద్ద పోటీ ఎదురవుతోంది. తాజాగా నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్ వారు అడుగుపెట్టారు..

Dil Raju have big twist on Mahesh cinema on trivikram
Dil Raju have big twist on Mahesh cinema on trivikram

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలని నైజాంలో మైత్రీ వారే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు వాళ్ళ సినిమాలని దిల్ రాజుకే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి.. మైత్రీ వారు కూడా నైజాం, ఉత్తరాంధ్రల్లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అందుకే ఈ రెండు సినిమాలని వల్లే నేరుగా రిలీజ్ చేసి దిల్ రాజుకు ఊహించని షాక్ గా ఇచ్చారని అంతా అనుకుంటున్నారు.

 

ఈ నేపథ్యంలో దిల్ రాజుకు త్రివిక్రమ్ కూడా షాకిచ్చినట్టుగా టాక్. త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఇక ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ నైజాం డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ పిలింస్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఎప్పటి నుంచో మహేష్ సినిమాలని నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు SSMB28 ని మాత్రం ఏషియన్ ఫిలింస్ కే హారిక అండ్ హాసిని వారు ఇచ్చేయడంతో దిల్ రాజుకు ఇది పెద్ద షాకే అంటున్నాయి నైజాం ట్రేడ్ వర్గాలు. ఇక దిల్ రాజు కి వరుసగా షాక్స్ తగులుతున్నాయి.