Krishna : తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలు తెరకెక్కించి .. ఫ్యామిలీ హీరోగా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈస్ట్ మన్ కలర్ ను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇకపోతే ఇటీవల ఖైదీ సినిమా నిర్మాత ధనుంజయ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు ధనుంజయ రెడ్డి.. ఈయన మాట్లాడుతూ.. సీఎం జగన్ గురించి సినిమా తీయాలని చాలామంది భావిస్తున్నారు. కానీ అవకాశం వస్తే సినిమా తీయడానికి నేను సిద్ధమేనని ఆయన కామెంట్లు చేశారు.
ఖైదీ సినిమా సక్సెస్ అవడానికి కోదండరామిరెడ్డి పరుచూరి బ్రదర్స్ కారణమని తెలిపిన ఆయన.. ఆ సినిమాలో భారీ బడ్జెట్ తో కేవలం కృష్ణ గారితోనే సినిమాలు తెరకెక్కించాము అని .. కృష్ణ గారికి అప్పట్లోనే 7 లక్షల రూపాయల పారితోషకం ఇచ్చామని ధనంజయ రెడ్డి తెలిపారు. అంతేకాదు ఆ కాలంలో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా కూడా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ ఆ కాలంలోనే అన్ని లక్షల పారితోషకం తీసుకొని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతూ స్వర్గస్తులైన విషయం తెలిసిందే.