BalaKrishna : బాలయ్య బంగారం రా .. నడిరోడ్డు మీద ఏం చేసాడో చూడండి !

BalaKrishna :విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఆ తరువాత బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నందమూరి బాలకృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తరువాత రోగులతో సెల్ఫీలు దిగారు.

Balakrishna giving selfies to cancer patient children
Balakrishna giving selfies to cancer patient children

క్యాన్సర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాలికల వార్డు లోకి వెళ్లి బాలయ్య వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు అంతేకాదు పిల్లలందరూ బాలయ్యతో సెల్ఫీలు కోరగా.. వాళ్లందరితో నవ్వుతూ ఫోటోలు దిగారు అడిగిన వారందరికీ ఓపికగా సెల్ఫీలు ఇచ్చారు బాలయ్య తమతో సెల్ఫీ దిగడం చూసి ఆ బాలికలు తెగ మురిసిపోయారు సంబరపడిపోయారు వాళ్ల ఆనందానికి అవధులు లేవు..

బాలకృష్ణ మనసులో తన తండ్రి చనిపోయిన రోజన్నా బాధ ఉన్నా కూడా ఆ బాధను లో లోపలే దిగమింగుకొని పరుల సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కున్నారు ఓ పక్క తన తండ్రికి నివాళులు అర్పించి మరోపక్క చిన్నారుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి వాళ్లందరికీ సెల్ఫీలు ఇచ్చారు.

 

ఆనందం తో వారు మరింత తొందరగా కోలుకోవాలని బాలకృష్ణ ఉద్దేశం. అలాగే వాళ్లలో మానసిక ధైర్యాన్ని దింపే మాటలు కూడా బాలకృష్ణ ఆ బాలికలకు చెప్పారట. నిజంగా బాలయ్యది ఎంత గొప్ప మనసు అర్థం చేసుకోవచ్చు మనసులో బాధ ఉన్నా కానీ ఇతరులకు సాయం చేయడంలో బాలయ్య ఎప్పుడు ముందే ఉంటారు..