Bala Krishna: విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకొని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై రికార్డులని చెరిపేస్తున్నాడు. అన్స్టాపబుల్ షోతో దబిడ దిబిడే అంటున్నాడు. అయితే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న సమయంలో ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు. నిన్న ఆయన విశ్వక్ సేన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ధమ్ కీ’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా హాజరు కాగా, ఈ ఈవెంట్లో ఆదిత్య 999పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
గుడ్ న్యూస్..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతదేశ చిత్రపరిశ్రమలోనే ఓ మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి. ఎవ్వరూ ఊహించని రీతిలో గ్రాఫిక్స్ చేసి సింగీతం శ్రీనివాసరావు ప్రతి ఒక్కరిని అబ్బురపరిచారు. అయితే గత కొంతకాలంగా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ ఉంటుందని, ఆదిత్య 999 పేరుతో ఇది తెరకెక్కబోతుందని పలుమార్లు పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అన్ స్టాపబుల్ షోలో ఆదిత్య 999 సినిమా ఉంటుందని, దాంట్లో తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ కూడా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ని ఆనందిపంజేశాడు.
ఇక విశ్వక్ సేన్ మూవీ ఈవెంట్లో ఈ సినిమా గురించి మాట్లాడిన బాలయ్య.. చిన్న వయస్సులోనే విశ్వక్ సేన్ హీరో గా, దర్శకుడిగా మరియు నిర్మాతగా పని చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సంతోషంగా ఉంది..నేను కూడా త్వరలోనే నా స్వీయ దర్శకత్వం లో ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 ని రూపొందిచబోతున్నాను…వచ్చే ఏడాది లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం అని తెలిపాడు. దీంతో వచ్చే ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ సినిమా మొదలు కానుందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.