Anasuya : అతిపెద్ద వివాదం లో యాంకర్ అనసూయ !!

Anasuya: యాంక‌ర్ అన‌సూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజ‌ల‌కు ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల సినిమాలు, టీవీ షోస్‌తో క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా రిలీజ్ స‌మ‌యంలో అన‌సూయ చేసిన కామెంట్ హాట్ టాపిక్ మార‌గా, ఆ స‌మ‌యంలో ఈ అమ్మ‌డిని ఆంటీ అంటూ తెగ ట్రోల్ చేశారు. అయితే త‌న‌ని విమ‌ర్శించిన వారికి అన‌సూయ గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసింది. ఇక సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా పేర్కొంది. అయితే ఎట్ట‌కేల‌కు అన‌సూయ‌ని వేధించిన వ్య‌క్తి దొరికేశాడు. ఏపీకి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు అనే వ్యక్తిని అనసూయ కేసు ప్రకారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టినట్లు స‌మాచారం.

anasuya-news-hot-topic-in-industry
anasuya-news-hot-topic-in-industry

మ‌రో వివాదం..

నిందితుడి మీద 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు టాక్. సదరు వ్యక్తి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు . అయితే వాటిలో త‌న ఫొటోలు ఉన్నట్లు గుర్తించిన అనసూయ ఈ నెల 17వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా, త్వ‌ర‌గానే వారు విచార‌ణ చెప‌ట్టి అరెస్ట్ చేశారు. సదరు నిందితుడు 267 ట్విట్టర్ అకౌంట్లు మెయింటైన్ చేస్తూ వాటి ద్వారా హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

సదర్ నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పసలపూడి అనే గ్రామానికి చెందిన వాడిగా చెబుతుండ‌గా, గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబింగ్ వర్క్ చేసి ఆ తర్వాత మన దేశానికి తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు. కేవలం అనసూయ మాత్రమే కాదు నటి రోజా, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి వంటి వారి ఫోటోలను సోష‌ల్ మీడియాలో వాడుతూ దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పుడు పండ‌రి అరెస్ట్ కావ‌డంతో అన‌సూయ పేరు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఇటీవ‌ల అన‌సూయ‌కి వివాదాలు చాలా కామ‌న్‌గా మారాయి.