Adipurush : బాహుబలి తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన ప్రభాస్ త్వరలో ఆదిపురుష్ చిత్రంతో పలకరించాలని అనుకున్నాడు. కాని టీజర్కి చాలా నెగెటివిటీ రావడంతో సినిమాని కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలే నిజం అయ్యాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది జూన్ 16కు వాయిదా వేస్తున్నట్టు దర్శకుడు ఓం రౌత్ అధికారిక ప్రకటన చేశాడు. ఆదిపురుష్ కేవలం సినిమా కాదు. శ్రీరాముడికి ప్రతిరూపం. మన చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబిస్తుంది. అందుకే ప్రేక్షకులకు పూర్తి విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు, టీమ్ కు మరింత సమయం కావలసిన అవసరం ఉంది. ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేస్తాం అంటూ అఫీషియల్గా ప్రకటించారు.
![Adipurush : ఆదిపురుష్కి దెబ్బ మీద దెబ్బ.. ఏకంగా ఆరు నెలలు వాయిదా వేయడంతో ఆందోళనలో ఫ్యాన్స్ adipurush-postponed-again](https://dailytelugunews.com/wp-content/uploads/2022/11/tr.jpg)
Adipurush : మళ్లీ వాయిదా..
రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు కావడంతో సినిమా ఫ్లాప్ అని ముందే అంచనాకు వచ్చారు.. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడని, గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారని విమర్శలు కురిపించారు. ఈ క్రమంలో చిత్రాన్ని ఆరు నెలల పాటు వాయిదా వేసారు. ప్రభాస్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో ఆదిపురుష్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఆదిపురుష్ టీజర్ ప్రభాస్ ఫ్యాన్ ను చాలా నిరాశపరిచింది. ఆదిపురుష్ టీజర్ ఒక ప్లానేట్ ఆఫ్ ది ఏప్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, పైరెట్స్ ఆఫ్ ది కరెబియన్ వంటి చిత్రాల నుంచి కాపీ కొట్టి వింత జీవులను సృష్టించినట్టే ఉందని ఆరోపించారు. ఈవిల్ డెడ్ లో ఉన్న గ్రాఫిక్స్ లా ఆ వింత జీవులేంటని మీమ్స్ తో రచ్చ చేశారు. టీజర్లో హనుమంతుని సైన్యంలో ఒక పాత్ర టెంపుల్ రన్ గేమ్ లా ఉందని, అసలు ఈ సినిమా కోసం నిజంగానే రూ. 500 కోట్లు ఖర్చుపెట్టారా అంటూ నానా హంగామా చేయడంతో ఇప్పుడు మళ్లీ సినిమాకి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట మేకర్స్.