Ram Mohan Naidu : తెలుగుదేశం పార్టీలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి రామ్మోహన్ రాయుడు.. ఎర్రం నాయుడు తనయుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా.. అతికొద్ది కాలంలోనే దానికంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. లోక్ సభలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ చుక్కలు చూపిస్తున్నారు.. అధికారిక వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడాలేని ఎన్నో విషయాలను గొంతేత్తి ప్రశ్నించారు..
దాంతో వైసిపి ఎంపీల కంటే టిడిపి ఎంపీ రామ్మోహన్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు అని పేరును తెచ్చుకున్నారు.. ఇక వైసిపి నుంచి గెలిచిన చాలామంది ఎంపీలు అసలు సభకే రారు.. వచ్చిన అసలు ప్రశ్నలే అడగరు .. ఒకవేళ అడిగిన తూతూ మంత్రంగా అడుగుతారు అనే విమర్శలు ఎక్కువ. మంగళవారం లోక్ సభ లో రామ్మోహన్ నాయుడు స్పీకర్ను ప్రశ్నలతో దాడి చేశాడు.. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటు రాష్ట్రాలు ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎటువంటి వ్యత్యాసం చుపలేదని 14వ ఫైనాన్స్ కమిషన్ మరోసారి స్పష్టం చేశారు. విభజన చట్టం అమలుపై ఇప్పటికే 28 సార్లు సమావేశాలు నిర్వహించినట్లుగా కేంద్ర సహాయ మంత్రి అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి పలు సంక్షేమ పథకాల్లో నిధులు కేటాయించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.. వైసిపి ఎంపీలు అడగని పలు అంశాలను టచ్ చేస్తూ వాటికి నిధులు రావాలని అడిగారు మరోసారి తన వాక్చాతుర్యాన్ని చూపించారు టిడిపి ఎంపీ మోహన్ నాయుడు.