Big Breaking: చెప్పినట్టుగానే వారి అకౌంట్లలో రూ.10వేలు జమ చేసిన సీఎం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ‘వై యస్ ఆర్ మత్స్యకార భరోసా పథకం’లో భాగంగా మత్స్యకారుల అకౌంట్లలో రూ.10వేల చొప్పున తాజాగా జమచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 1.23 లక్షల కుటుంబాలకు రూ.123 కోట్ల మేర మేలు చేకూరనుంది. ఈ విషయమై బాపట్ల నిజాంపట్నం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రూ.4వేలు మాత్రమే ఇచ్చేవారని, దాన్ని రూ.10వేలకు పెంచామని తెలిపారు.

అదేవిధంగా, ఓ యన్ జి సి పైప్ లైన్ పనుల వల్ల జీవనోపాధి కోల్పోయిన సుమారు 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.107 కోట్లను సాయం చేసినట్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలాగున్నా ఇక్కడ బడుగు, బలహీన వర్గాలకు సాయం చేయడం తమ కార్త్యవ్యమని అన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసారు. రాష్ట్ర గవర్నమెంట్ నిధిలో దండిగా డబ్బులు వున్నపుడు కూడా వారు చేసేదేమి లేదని, పైగా ఆ ధనం వారి వారి జేబులు నింపుకోవడానికీ పనికి వచ్చేదని ఆరోపించారు.